Telugu Gateway
Politics

వైసీపీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్లు లేవు..వాసుపల్లి ఏమిచేస్తారు?

వైసీపీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్లు లేవు..వాసుపల్లి ఏమిచేస్తారు?
X

విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన కుమారులను వైసీపీలో చేర్చిన విషయం తెలిసిందే. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆయన మాత్రం కండువా కప్పుకోలేదు. వాసుపల్లి పార్టీ మార్పుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్లు ఇవ్వటంలేదని..వైసీపీలో చేరి వాసుపల్లి గణేష్ ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.

వైసీపీలో చేరిన వారంతా ఇంట్లో కూర్చోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు విశాఖలో తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాసుపల్లి ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వల్లే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చిందనే భ్రమలో వాసుపల్లి వున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు. అధికారం పోతే బతకలేమా? అని వాసుపల్లిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారు.‌ ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు.

Next Story
Share it