Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు మానవరూపంలో ఉన్న దెయ్యం

చంద్రబాబు మానవరూపంలో ఉన్న దెయ్యం
X

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంతర్వేది రథం దగ్దం అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాను అధికారంలోకి ఉండగా..ఏపీలోకి సీబీఐ రావటానికి వీల్లేదని ప్రకటించిన చంద్రబాబుకు ఎప్పుడు సీబీఐపై నమ్మకం కుదిరిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన గురువారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. అంతర్వేది సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఈవోను వెంటనే తొలగించిందని పేర్కొన్నారు. కొత్త రథాన్ని తయారు చేయడం కోసం ప్రభుత్వం 95 లక్షల రూపాయిలు కేటాయించిందని తెలిపారు. దోషులు ఎంతటివారైనా వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నాయని, మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. మంత్రులు సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు కొంతమంది రచ్చ చేయాలని చూసారని, కొన్ని శక్తులు ప్రవేశించి మరొక ప్రార్ధన మందిరం మీద రాళ్లు వేశారని మండిపడ్డారు. కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, మానవ రూపంలో ఉన్న దెయ్యం చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. .సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రికి అన్ని కులాలు, మతాలు సమానమేనని తెలిపారు.

Next Story
Share it