Telugu Gateway
Telangana

శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
X

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘గతంలో ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 30 చనిపోయారు. తమిళనాడులో కూడా గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది. దీనిపై కమిటీ వేశాం. కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు.ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. త్వరలోనే వాళ్ళ కుటుంబాలకు జెన్ కో నుంచీ సహాయం అందజేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు’అని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో చోటుచుకున్న ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకున్నామని, సిబ్బందిని కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. విద్యుత్‌ శాఖ మంత్రితో కలిసి ఆ రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని కానీ తమ వల్లకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ కేంద్రలో ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్ ట్రిప్ కావాలి. కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదు. గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి. రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది అని తెలిపారు.

Next Story
Share it