కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి
BY Telugu Gateway12 Aug 2020 2:53 PM GMT
X
Telugu Gateway12 Aug 2020 2:53 PM GMT
కరోనాతో ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. చికిత్స పొందుతూనే బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. గతంలో ఆయన కడప నుంచి తెదేపా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. శ్రీకాంత్ రెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవ రెడ్డి కుమారుడు. మోడరన్ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డి పనిచేశారు.
Next Story