Telugu Gateway
Telangana

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ
X

తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెటీఆర్ కేంద్ర మంత్రి ముందు పలు ప్రతిపాదనలు పెట్టారు వరంగల్ విమానాశ్రయాన్ని ఉడాన్ పథకంలో చేర్చాల్సిందిగా కోరినట్లు తెలిపారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పౌరవిమానయాన అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

అదే సమయంలో నూతన పురపాలక చట్టాన్ని గురించి కేంద్ర మంత్రికి కెటీఆర్ వివరించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ కింద రావాల్సిన 784 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు. అక్టోబర్ లో మరోసారి పూర్తి నివేదికతో భేటీ అవుతామని కేంద్ర మంత్రి తెలిపారన్నారు. కెటీఆర్ తోపాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు.

Next Story
Share it