Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను రాజీనామా చేసి అమరావతి లో రాజధాని కోనసాలని ఉప ఎన్నికలకి వెళ్ళి 20కి 20 సిట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ పై సీఎం జగన్ పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఒక వేళ చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికలలో ఓడిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా రావాలన్నారు. అమరావతి లో భూములు ఇచ్చిన రైతుల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు, ఆయన శాసన సభ్యులు వెంటనే రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తీసుకున్న పిచ్చి తుగ్గక్ నిర్ణయాలు కు రాష్ట్ర ప్రజలు చిత్తు,చిత్తుగా ఓడించినా సిగ్గు లేకుండా జూమ్ యాప్ లో పిచ్చివాగుడు వాగుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.

రాయలసీమ జిల్లా లో 52 సీట్లు ఉంటే చంద్రబాబు నాయుడు, బాలయ్యను మాత్రమే గెలిపించారు. తెలుగుదేశం పార్టీ కి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రాంతం అక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మిన ప్రజలు చంద్రబాబు నాయుడు కి బుద్దిచెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా రాజధాని పెట్టిన కృష్ణా, గుంటూరు ప్రజలకు కూడా ఆయన చేసిన మోసం గ్రహించి లోకేష్ ను కూడా ఓడించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలి లేకపోతే మళ్ళీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Next Story
Share it