Telugu Gateway
Andhra Pradesh

విజయవాడలో దారుణం..పది మంది మృతి

విజయవాడలో దారుణం..పది మంది మృతి
X

ఆదివారం తెల్లవారు జామునే విజయవాడలో దారుణం జరిగింది. స్వర్ణాప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా పది మంది మృత్యువాత పడ్డారు. ఈ హోటల్ ప్రస్తుతం కోవిడ్ చికిత్సా కేంద్రంగా ఉంది. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం దీన్ని కోవిడ్ కేర్ కేంద్రంగా వాడుతోంది. ఈ సెంటర్ లో 50 వరకూ చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదంతో పేషంట్లు హాహాకారాలు చేశారు. షార్ట్ సర్కూట్ కారణంగా ఇందులో మంటలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో మంటలతో భవనమంతా దట్టమైన పొగలు వ్యాపించగా, ఊపిరాడని బాధితులు కిటికీల వద్దకు వచ్చి కేకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు బాధితులు ఇప్పటికే సొమ్మసిల్లి పడిపోగా, వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు సీఎం జగన్ 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.

Next Story
Share it