Telugu Gateway
Politics

కర్ణాటకలో అగ్గిరాజేసిన సోషల్ మీడియా పోస్ట్

కర్ణాటకలో అగ్గిరాజేసిన సోషల్ మీడియా పోస్ట్
X

ఓ సోషల్ మీడియా పోస్టు కర్ణాటకలో పెద్ద అలజడి రేపింది. ఇందులో ఏకంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. వందల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు కూడా గాయాలపాలైన వారిలో ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో బెంగుళూరులో కూడా 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలోని డిజె హళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు సోషల్ మీడియాలో ఓ వర్గాన్ని కించపర్చేలా పోస్టులు పెట్టారంటూ వందలాది మంది ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు.

ఆయన ఇంటి వద్ద ఉన్న వాహానాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లోనే ముగ్గురు మరణించారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో అరవై మంది పోలీసులకు గాయాలయ్యాయి. వివాదస్పద పోస్టులు పెట్టిన ఎమ్మెల్యే అల్లుడు నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు అల్లర్లకు కారణమైన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకున్నారు.

Next Story
Share it