Telugu Gateway
Telangana

సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం

సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం
X

శుభవార్త. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా?. అంటే ఔననే చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరక్టర్ శ్రీనివాసరావు. తెలంగాణలో ప్రస్తుతం రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసు ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోందని చెప్పారు. ఈ నెలాఖరుకు నగరంలో కేసులు చాలా వరకూ తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను తెలిపారు. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌ కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసివేయడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Next Story
Share it