Telugu Gateway
Telangana

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ
X

శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం కెసీఆర్ ను కూడా కోరారు. అయితే తెలంగాణ సర్కారు ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి ఇదే అంశంపై లేఖ రాశారు. ‘శ్రీశైలం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రమాద సంకేతాల పై సిబ్బంది లేఖ రాసినా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించ లేదు.

శ్రీశైలం డ్యాం భద్రత, విద్యుత్ ప్లాంట్ నిర్వహణ లోపాల పై కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభ్యంతరాలు, ఆందోళనలను కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తొమ్మిది మంది ప్రాణలతో పాటు, వేల కోట్ల జాతి సంపద దగ్ధమైంది . దీనిపై నిస్పాక్షిక విచారణ జరగాలి... సీబీఐ విచారణ జరిపించండి. బాధిత కుటుంబాలకు రూ. కోటి సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’ అని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it