శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు సాయం
BY Telugu Gateway21 Aug 2020 2:45 PM GMT
X
Telugu Gateway21 Aug 2020 2:45 PM GMT
తెలంగాణ సర్కారు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. ఏఈలతో పాటు ఇతర సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు శాఖాపరంగా కూడా చేయాల్సిన సాయం చేస్తామన్నారు.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. గురువారం అర్థరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో 9 మంది మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనలో మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు.
Next Story