Telugu Gateway
Andhra Pradesh

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర సర్కారుదే

రాజధానిపై నిర్ణయం రాష్ట్ర సర్కారుదే
X

ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం శుక్రవారం నాడు హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సర్కారు గురువారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్‌ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్లే భావించాలి.

హోదా గురించి ప్రతి సమావేశంలో అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృత అంశంగా ఉంది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే. అదే విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది.’ అని పేర్కొంది. ‘రాజధాని’ ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే.

Next Story
Share it