Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
X

కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి కొత్తగా నలుగురు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు. దీంతో వైసీపీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్యరామిరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త సభ్యులు అందరితో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు సమావేశాలు ప్రారంభం అయిన సమయంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కొత్త సభ్యులతో కలుపుకుంటే రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది.

Next Story
Share it