Telugu Gateway
Telangana

కరోనా కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతోంది

కరోనా కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతోంది
X

తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని మండిపడింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా టెస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉందని మండిపడింది. ఓ వైపు కోర్టు ప్రతిసారి సర్కారు తీరును తప్పుపడుతుంటే హైకోర్టు ప్రశంసించినట్లు హెల్త్ బులెటిన్ లో ఎలా పెడతారని మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం నాడు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది.

అధికారులపై కేసు పెట్టి, సస్పెండ్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బులెటిన్లలో ఇప్పటికీ సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టు ఆగ్రహం. ఆసుపత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఇవ్వడం లేదన్న హైకోర్టు. అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్న హైకోర్టు. సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసినట్లు ఉందని మరోసారి మండిపడింది.

Next Story
Share it