Telugu Gateway
Telangana

రాజ్ భవన్ లో కరోనా కలకలం

రాజ్ భవన్ లో కరోనా కలకలం
X

తెలంగాణ రాజ్ భవన్ లో కలకలం. ఒకేసారి పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తోపాటు అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే గవర్నర్ తమిళ్ సైతోపాటు ఉన్నతాధికారులకు కరోనా నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి. కొంత మంది పోలీసులు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారినపడినట్లు గుర్తించారు.

తాను కరోనా పరీక్షలు చేయించుకున్న విషయాన్ని గవర్నర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెడ్‌జోన్లలో ఉన్నవారు, కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్‌ తమిళి సై సూచించారు. ముఖ్యంగా ఆమె ఫోర్ టీలన సూత్రం పాటించాలని సూచించారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్ మెంట్, టీచ్ మార్గాలను అనుసరించాలన్నారు.

Next Story
Share it