అచ్చెన్నాయుడికి హైకోర్టులో షాక్..బెయిల్ నో
BY Telugu Gateway29 July 2020 6:10 AM GMT
X
Telugu Gateway29 July 2020 6:10 AM GMT
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన సమయంలో ఈఎస్ఐ కొనుగోళ్లలో 150 కోట్ల రూపాయల మేర అక్రమాలకు కారణమయ్యారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అచ్చెన్నాయుడితోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న రమేష్ కుమార్, మురళి, సుబ్బారావుల బెయిల్ పిటీషన్లను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 12న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు నిమ్మాడలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Next Story