Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ రేంజ్ ఆ నోట్ల కట్టలే చెబుతున్నాయి

వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ రేంజ్ ఆ నోట్ల కట్టలే చెబుతున్నాయి
X

పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని ఫోజులు కొడుతున్న సర్కారు రాష్ట్రం నుంచి అక్రమంగా వెళుతున్న కోట్ల రూపాయలను మాత్రం పట్టుకోదా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ శాండ్,ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుందని పేర్కొన్నారు.

బుధవారం రాత్రి తమిళ ఛానల్స్ లో ఈ కారు వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ కారుకు ఏపీకి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే వార్తలు రావటంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి ఆ స్టిక్కర్ జిరాక్స్ తీశారని.. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Next Story
Share it