Telugu Gateway
Cinema

ప్రభాస్ కు జోడీగా దీపికా పడుకొణే

ప్రభాస్ కు జోడీగా దీపికా పడుకొణే
X

బాలీవుడ్ భామ దీపికా పడుకొణే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా గ్రాండ్ గా. వైజయంతి మూవీస్ వంటి భారీ బ్యానర్ లో నటిస్తోంది. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ కొత్త ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తో కలసి ఈ భామ సినిమా చేయనుంది. ఈ సినిమాను ‘మహానటి’ సినిమాతో అగ్రదర్శకుల జాబితాకు ఎక్కిన నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ దీపికా పడుకొణే అన్న విషయాన్ని చిత్ర యూనిట్ ఆదివారం నాడు వీడియో ద్వారా వెల్లడించింది. బాహుబలి రెండు భాగాల తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. కాకపోతే ఇది అంచనాలను అందుకోవటంలో విఫలమైంది.

అయినా సరే ప్రభాస్ మాత్రం వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వైజయంతీ మూవీస్ కొత్త సినిమాకు ఇఫ్పుడు పలు అదనపు ఆకర్షణలు యాడ్ అయినట్లు అయింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దీపికా పడుకొణే కాంబినేషన్ తో మార్కెట్లో అంచనాలు భారీగా పెరిగిపోయినట్లు అయింది. ఇది ప్రభాస్ 21వ సినిమా. ఈ సినిమాను పాన్ ఇండియా టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోవిడ్ 19 హంగామా ముగిసిన తర్వాతే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Next Story
Share it