Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర

వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అన్నీ కుంభకోణాలే అన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్ కూడా తప్పదన్నారు. ఫస్ట్ అచ్చెన్నాయుడు, తర్వాత కొల్లు రవీంద్ర..రేపు గంటా కూడా అరెస్ట్ అవ్వకతప్పదన్నారు. గంటా అనుచరులు విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

వైసీపీ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో గజం స్థలం కూడా కబ్జాకు గురికాలేదన్నారు. పైగా తాము 400 కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడామని తెలిపారు. బీచ్ రోడ్ లో ట్రామ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని, మైట్రో రైలుతో విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. ఆయన గురువారం నాడు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖను పరిపాలనా రాజధాని కాకుండా ఆపలేరన్నారు. విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ అయిందని తెలిపారు.

Next Story
Share it