Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?

చంద్రబాబుకు  సోనూసూద్ స్పూర్తినివ్వాలా?
X

సోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంత జిల్లా. పధ్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేతగా రికార్డు. ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన సంఘటన మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఇది చూసిన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు కానీ..సిని హీరోలుగా చెప్పుకుంటున్న వారెవరూ కానీ స్పందించలేదు. సోనూసూద్ స్పందించాడు. తాను చెప్పిన మాటను అమలు చేశాడు. చెప్పినట్లే ట్రాక్టర్ ఆ కుటుంబానికి పంపాడు. దీనికి సంబంధించి సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ వెంటనే తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు.

ఫోన్ చేసి సోనూసూద్ ను అభినందించారు. అంతే కాదు..రైతు నాగేశ్వరరావుకు చెందిన ఇద్దరు కూతుళ్ల విద్యతోపాటు వాళ్లు తమ లక్ష్యాలు అందుకునేందుకు సహకరిస్తానని ప్రకటించారు. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. అయితే ఎక్కడో ముంబయ్ లో ఉండే సోనూసూద్ స్పందించి..అందరి అభినందనలు అందుకుంటుంటే తప్ప...చంద్రబాబుకు ఈ సంగతి తెలియదా?. చంద్రబాబులో ముంబయ్ లో ఉండే సోనూసూద్ స్పూర్తి నింపాలా?. ఇదే అత్యంత విషాదకరం. ఇది ఒకెత్తు అయితే అసలు రైతులు అంటే వైసీపీ..వైసీపీ అంటే రైతులు అని చెప్పుకునే అధికార వైసీపీ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రైతు ఘటనపై ఇప్పటివరకూ స్పందించిన దాఖలాలు లేవు.

Next Story
Share it