Telugu Gateway
Andhra Pradesh

అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట

అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట
X

ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి స్పల్ప ఊరట లభించింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవలే జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ వెంటనే అచ్చెన్నాయుడు తనకు ఇంకా పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని..ప్రైవేట్ ఆస్పత్రిలో చేరేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై పలు మార్లు వాదనలు ఉన్న హైకోర్టు బుధవారం నాడు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు ఇచ్చింది.

అయితే కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది.. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్థారించాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it