Telugu Gateway
Andhra Pradesh

భక్తులకు తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు

భక్తులకు తెరుచుకోనున్న తిరుమల ద్వారాలు
X

కరోనా కారణంగా తొలిసారి లక్షలాది మంది భక్తులకు గత కొన్ని నెలలుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కరువైంది. త్వరలోనే భక్తులకు వెంకన్న దర్శనం అందుబాటులోకి రానుంది. తొలి దశలో సర్కారు టీటీడీ ఉద్యోగులు, స్థానికులను దర్శనానికి అనుమతి ఇఛ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ప్రయోగాత్మక దర్శనాలు పూర్తి అయిన తర్వాత భక్తలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే అది ఎప్పటి నుంచి అన్నది త్వరలోనే ప్రకటించనున్నారు.

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్‌ మంగళవారం ఉత్వర్వులు జారీచేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరిస్తూ శ్రీవారి దర్శనాన్ని కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మక దర్శనాలు ప్రారంభించనున్నారు.

Next Story
Share it