Telugu Gateway
Andhra Pradesh

రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు

రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు
X

వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొంత కాలంగా ప్రభుత్వంపై, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ కు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో కోరారు. వైసీపీకి చెందిన మంత్రులతోపాటు ఎమ్మెల్యేలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతే కాదు ఇసుక దగ్గర నుంచి ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో అవినీతి నెలకొందని విమర్శలు చేశారు.

దీంతోపాటు తాను జగన్ బొమ్మతో తాను గెలవలేదని..తన సొంత ఇమేజ్ తో నే గెలిచినానని వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనకు సవాల్ చేసిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి తిరిగి జగన్ బొమ్మతో పోటీకి దిగాలని..అప్పుడు తాను కూడా తన సొంత బొమ్మతో ఫోటీ చేస్తానని సవాల్ విసిరారు. ఈ తరుణంలో అధిష్టానం జారీ చేసిన నోటీసుకు రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. రఘురామకృష్ణంరాజు స్పందన..అధిష్టానం తదుపరి చర్యలు అనేవి ఇఫ్పుడు కీలకంగా మారనున్నాయి.

Next Story
Share it