Telugu Gateway
Telangana

చైనా సరిహద్దు పోరులో తెలంగాణ వాసి మృతి

చైనా సరిహద్దు పోరులో తెలంగాణ వాసి మృతి
X

భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ముగ్గరు సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అందులో తెలంగాణ కు చెందిన సంతోష్ కూడా ఉన్నారు. సంతోష్ ది సూర్యాపేట. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు.

ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సంతోష్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు.

Next Story
Share it