Telugu Gateway
Andhra Pradesh

ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడిని ఇరికించారు

ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడిని ఇరికించారు
X

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.అందులో భాగంగానే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని కూడా ఈఎస్ఐ కేసులో ఇరికించారని ఆరోపించారు. లోకేష్ శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. అచ్చెన్నా యుడు ను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు.

అలాగే పైబర్ గ్రిడ్ వ్యవహారంలో ఐటి మంత్రికి సంబందం ఉండదని ఆయన చెప్పారు. వైసిపి సర్కారు ఇసుక, మద్యం విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సామాజిక మాద్యమాలలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. కూన రవికుమార్ పై కేసు పెట్టారు. పెళ్లికి వెళితే యనమలపై కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై కూడా నిర్భయ కేసు పెట్టారని లోకేష్ అన్నారు.

Next Story
Share it