Telugu Gateway
Politics

సరిహద్దు వివాదం..జూన్ 19న మోడీ అఖిలపక్షం

సరిహద్దు వివాదం..జూన్ 19న మోడీ అఖిలపక్షం
X

ఇండియా-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 19న ఈ భేటీ జరగనుంది. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో 19 సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నరేంద్రమోడీ భేటీ కానున్నారు. ఈ భేటీ వర్చువల్ రూపంలో సాగనుంది. కరోనా కారణంగా ప్రస్తుతం కీలక సమావేశాలు అన్నీ ఇదే రూపంలోసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై ఘాటు విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ అఖిలపక్ష భేటీకి నిర్ణయం తీసుకోవటం విశేషం.

Next Story
Share it