Telugu Gateway
Andhra Pradesh

కాపునేస్తంపై పవన్ దుష్ప్రచారం

కాపునేస్తంపై పవన్ దుష్ప్రచారం
X

కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరుగునపడేసేందుకే వైసీపీ ప్రభుత్వం కాపునేస్తంతో లెక్కల గోల్ మాల్ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై అధికార వైసీపీ స్పందించింది. ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ఈ అంశంపై మాట్లాడుతూ కాపు నేస్తంపై పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాపులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూలేని రీతిలో సాయం చేస్తుంటే పవన్ కు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయరా? అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో కాపులకు రూ.4,769 కోట్లు ఆర్ధిక సాయం చేశామన్నారు.

మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్‌కు ఎందుకంత ఉక్రోషం. ఓర్వలేనితనంతోనే అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారు..అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదన్నారు. చంద్రబాబు హయాంలో పవన్‌కు కళ్లు కనిపించలేదు. చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్‌ తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it