కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి
BY Telugu Gateway30 Jun 2020 7:35 AM GMT
X
Telugu Gateway30 Jun 2020 7:35 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువకు గండిపడింది. కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడి గ్రామంలోకి నీరు ప్రవహించింది. దీంతో గ్రామం నీటి మునిగింది.
ఉదయం 7 గంటల ప్రాంతంలో కాలువకు గండి. పొలాలు, కూరగాయల తోటలతో పాటు, గ్రామంలోకి నీరు చేరింది. గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటిని అధికారులు నిలిపివేశారు. కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల కాలువకు గండిపడటంతో నాణ్యత ఎంత డొల్లగా ఉందో అన్న అంశం తేటతెల్లం అయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
Next Story