Telugu Gateway
Andhra Pradesh

అక్రమాలన్నింటిపై దర్యాప్తు చేయాలి

అక్రమాలన్నింటిపై దర్యాప్తు చేయాలి
X

తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై జనసేన స్పందించింది. అక్రమాలు అన్నింటిపై దర్యాప్తు చేయించాల్సిందేనని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయి. ఈ.ఎస్.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story
Share it