జగన్ తీరు ‘నేనే రాజు..నేనే మంత్రి’లా ఉంది
మాజీ ఎంపీ, సీనియర్ నేత జె సీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నియంతలా పరిపాలిస్తున్నాడని ఆరోపించారు. 151 సీట్లు గెలిచాను కాబట్టి నేనే రాజు..నేనే మంత్రి అన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఎక్కువ సీట్లు వచ్చాయనే అహంతో కోర్టులు లేవు..రాజ్యాంగం లేదు..నేను చెప్పిందే జరగాలని అనే ధోరణి ప్రమాదకరమన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు..ఏమి చెబుతున్నారో కూడా వినాలని వ్యాఖ్యానించారు. జె సీ దివాకర్ రెడ్డి సోమవారం నాడు అనంతపురంలోమీడియాతో మాట్లాడారు.
జగన్ ఎవరీ మాట వినడని..ఏమైనా చేస్తారేమో అన్న భయంతో కేంద్రం లేదా..ప్రధాని మోడీ ఒక్కరి మాటే వింటాడని జె సీ వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించటం కూడా సరికాదన్నారు. జగన్ వైఖరి నాకు రాజ్యాంగం లేదు..నేను చెప్పిందే జరగాలి అన్నట్లు ఉందన్నారు. న్యాయస్థానాలను గౌరవించే పద్దతి ఉండాలన్నారు. జగన్ పరిపాలన కాయకష్టం చేసుకునే ప్రజలకు ఏ మాత్రం అర్ధం కావటం లేదని తెలిపారు