Telugu Gateway
Telangana

కరోనాతో జర్నలిస్టు మృతి

కరోనాతో జర్నలిస్టు మృతి
X

హైదరాబాద్ లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధిత జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోంది. కరోనాతో బాధపడుతున్న‌ జర్నలిస్ట్‌ మనోజ్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కన్నుమూశారు. మాదన్న పేటకు చెందిన మనోజ్‌ పలు టీవీ ఛానళ్లలో క్రైమ్‌ రిపోర్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో క్రైం రిపోర్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పలు వార్తాపత్రికల సిబ్బంది కూడా కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం వీరందరూ చికిత్స పొందుతున్నారు.

Next Story
Share it