Telugu Gateway
Telangana

తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం

తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం
X

హైదరాబాద్ లో కరోనా భయపెడుతోంది. తాజాగా సీఎంవోలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆఫీసుకు అధికారులు రావటం మానేసి..ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయంతోపాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కరోనా కలకలం మొదలైంది. తెలంగాణ సచివాలయం ప్రస్తుతం బీఆర్ కె భవన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థికశాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏడో అంతస్తులో పనిచేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది హోంక్వారంటైన్‌ అయ్యారు.

ఎనిమిదో అంతస్తులో పనిచేసే కొందరు ఆర్థిక శాఖ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని నాలుగో అంతస్తులో ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ అంతస్తులో పనిచేసే ఉద్యోగులను ఇళ్లకి పంపించేశారు. అనంతరం కార్యాలయాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు. ఇలా వరస పెట్టి కీలక కార్యాలయాల్లో కరోనా కేసులు వెలుగుచూస్తుండటంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it