ఆసక్తికరంగా విశాల్ ‘చక్ర’ ట్రైలర్
విశాల్, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న సినిమా ‘చక్ర’. ఈ సినిమా ట్రైలర్ ను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఈ సినిమాలో డైలాగ్ లు..సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ ఒకటి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘కంటికి కన్పించని వైరస్ మాత్రమే కాదు..వైర్ లెస్ నెట్ వర్క్ కూడా ప్రమాదకరమే. వెల్ కమ్ టూ డిజిటల్ ఇండియా. ’ అంటూ డైలాగ్ వస్తున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ టీవీలో కన్పిస్తూ ఉంటారు.
యాక్షన్ సన్నివేశాలతోపాటు అన్ని రకాల హంగులతో ట్రైలర్ ను విడుదల చేశారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, మనోబాలా, రోబో శంకర్, విజయ, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=N8B3chilPxI&feature=emb_logo