Telugu Gateway
Politics

కరోనా రహిత తెలంగాణా నినాదాన్ని వదిలేసిన కెసీఆర్

కరోనా రహిత తెలంగాణా నినాదాన్ని వదిలేసిన కెసీఆర్
X

‘కరోనాతో కలసి బతకాల్సిందే. ఇప్పట్లో ఇది దాటిపోయే గండంలా లేదు. ఇంకో మార్గం లేదు. ఉపాయంతో మనల్ని మనం రక్షించుకోవాలి.’ ఇవీ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు. దీంతో కెసీఆర్ ఇంతకు ముందు చేసిన ‘కరోనా రహిత’ తెలంగాణ నినాదాన్ని వదిలేసిట్లు అయింది. పలుమార్లు విలేకరుల సమావేశాల్లోనే ఆ తేదీకి కరోనా రహిత తెలంగాణ..ఈ తేదీకి కరోనా రహిత తెలంగాణ అంటూ కెసీఆర్ ప్రకటనలు చేశారు.

కానీ ఏదీ వాస్తవంలోకి రాలేదు కదా...నిత్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని జిల్లాల్లో కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టినా అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా మంత్రి కెటీఆర్ కూడా కరోనాతో కలసి జీవించటం అలవాటు చేసుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కెసీఆర్ కూడా కరోనా రహిత నినాదాన్ని వదిలేసి..కరోనాతో కలసి జీవించాల్సిందే అంటూ తేల్చేశారు.

Next Story
Share it