Telugu Gateway
Telangana

వరంగల్ మరణాల మిస్టరీ వీడింది

వరంగల్ మరణాల మిస్టరీ వీడింది
X

కలకలం రేపిన వరంగల్ మరణాల మిస్టరీ వీడింది. ఇవి హత్యలే అని పోలీసులు తేల్చారు. తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట లో చోటు చేసుకున్న ఈ హత్యల వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. తొమ్మిది మందిని తానే హత్య చేశానని నిందితుడు సంజయ్‌ కుమార్ నిజం అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పట్లు సంజయ్ చెప్పాడు.

నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనే సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు. ఢిల్లీలో మక్సూద్‌ ఆలం అల్లుడు ఖతూర్‌ డైరెక్షన్‌లోనే వారందరినీ దారుణంగా హత్య చేశానని సంజయ్‌ చెప్పడం విశేషం. మక్సూద్‌ భార్య, కూతురితో సంజయ్‌ వాట్సప్‌ చాటంగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో నిగ్గు తేలింది. తొలుత ఇద్దరు బీహారీలను వదిలేద్దామని సంజయ్‌ భావించగా.. కేసు బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం సంజయ్‌ పోలీసులు అదుపులో ఉన్నాడు.

Next Story
Share it