Telugu Gateway
Telangana

ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి

ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి
X

రాష్ట్రంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు తొలగించిన తెలంగాణ సర్కారు తాజాగా ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి 21వ తేదీ నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండే వేళల్లో మాత్రం వాహనాలను అనుమతించరు. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు.

ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్​ టాగ్​ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్​ టాగ్​​ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ సూచించింది. ఓఆర్​ఆర్​పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్​ వెహికిల్స్​)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్​ ప్లాజా సిబ్బంది గుర్తించిన స్థానిక పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.

Next Story
Share it