Telugu Gateway
Politics

మోడీ ప్రకటించిన ప్యాకేజీ చూసి నవ్వుతున్నారు

మోడీ ప్రకటించిన ప్యాకేజీ చూసి నవ్వుతున్నారు
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కేంద్ర ప్యాకేజీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ కేంద్ర ప్యాకేజీ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ఉదయమే కిషన్ రెడ్డి కౌంటర్ గా తెలంగాణ సర్కారును టార్గెట్ చేశారు. కిషన్ రెడ్డి విమర్శలపై టీఆర్ఎస్ విప్ కర్నే ప్రభాకర్ స్పందించారు. మోడీ ప్రకటించిన ప్రకటించిన ప్యాకేజీ చూసి అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు.

అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది గుండుసున్నానే అన్నారు.సీఎం కెసిఆర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కిషన్ రెడ్డి ఒంటి కాలు మీద లేచి స్పందిస్తున్నారని విమర్శించారు. దేశానికి మోడీ వడ్డీ వ్యాపారి లా వ్యవహరిస్తున్నారు. మోడీ ప్రకటించిన ప్యాకేజీ సామాన్యులకే కాదు బీజేపీ నేతలకు కూడా అర్ధం కావడం లేదు. మోడి ఫ్యూడల్ విధానాలను గట్టిగా వ్యతిరేకించి తీరుతామన్నారు. తమతో కలిసి వచ్చే వివిధ రాష్ట్రాల ఎంపీ లతో కలిసి పార్లమెంటు లో విద్యుత్ బిల్లు పై పోరాడుతామని వెల్లడించారు.

Next Story
Share it