Telugu Gateway
Telangana

ఒకే రోజు 79 కేసులు..అన్నీ జీహెచ్ఎంసీలోనే

ఒకే రోజు 79 కేసులు..అన్నీ జీహెచ్ఎంసీలోనే
X

తెలంగాణకు కరోనా కేసుల షాక్. ఒకే రోజు ఏకంగా 79 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో కేసులు రావటం ఇదే మొదటిసారి. అంతే కాదు..వచ్చిన 79 కేసులూ జీహెచ్ఎంసీ పరిధిలోనే కావటం మరింత కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చిన 79 కేసులు కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1275కు పెరిగింది.

సోమవారం నాడు 50 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 801 మంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న వారు 444 మంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా కూడా తాజాగా వెలుగుచూస్తున్న కేసుల సంఖ్య అవేమీ ఫలితాలు ఇస్తున్నట్లు కన్పించటం లేదు.

Next Story
Share it