Telugu Gateway
Andhra Pradesh

ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే

ఎల్ జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకోవాల్సిందే
X

ప్రజల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ జి పాలిమర్స్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం ఆ పరిశ్రమను రక్షించే విధంగా వత్తాసు పలుకుతోందనే ఆగ్రహం, ఆవేదన ఆ ప్రాంతాలవారిలో ఉందని అన్నారు. తమ గ్రామాలకు ముప్పులా పరిణమించిన ఈ పరిశ్రమను తక్షణం తరలించడంతోపాటు అక్కడి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని తీసుకొని అందరికీ జీవిత కాల వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సహేతుకమైన ఆ ప్రాంత ప్రజల డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

విశాఖపట్నంలోని ఆర్.ఆర్.వెంకటాపురంతోపాటు పరిసరాల్లోని పద్మనాభ నగర్, వెంకటాపురం, ఎస్సీ,బీసీ కాలనీ, నందమూరి నగర్ ప్రాంతాలవారు ఈ పరిశ్రమతో ముప్పు పొంచి ఉందనిభయాందోళనలకు గురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆ బాధిత ప్రాంతాల ప్రజలు ఈ సంస్థను అక్కడి నుంచి తరలించాలి అనే ప్రధాన డిమాండ్ తోపాటు పలు విషయాలను తెలియచేస్తూ లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటుందని పేర్కొన్నారు.

Next Story
Share it