నిరాడంబరంగా నిఖిల్ పెళ్ళి
కరోనా కష్టాలు, లాక్ డౌన్ కష్టాలను అధిగమించి హీరో నిఖిల్ పెళ్ళి చేసుకున్నాడు. గురువారం ఉదయం అత్యంత నిరాడంబరంగా హీరో నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ పెళ్లి జరిగింది. దీంతో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. పలుమార్లు వాయిదా తర్వాత గురువారం ఉదయం 6.31 నిమిషాలకు ఈ పెళ్ళి జరిగింది. షామీర్పేట్లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్ పల్లవిల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత ఏప్రిల్ 16న వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కరోనా కారణంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథుల మధ్య నిరాడంబరంగా హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. పూర్తి నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ పచ్చని పందిరిలో పెళ్లితో ఒకటయ్యారు. వివాహానికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.బుధవారం రాత్రి నిఖిల్ను పెళ్లి కొడుకు, పల్లవిని పెళ్లికూతురుని చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.