Telugu Gateway
Politics

గాంధీ బొమ్మలే కాదు..వాళ్లవీ ముద్రించండి

గాంధీ బొమ్మలే కాదు..వాళ్లవీ ముద్రించండి
X

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు మరో కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవలే గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడు అంటూ ప్రశంసిస్తూ ట్వీట్లు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆయన మరో అంశాన్ని లేవనెత్తారు. దేశ కరెన్సీ నోట్లపై ఒక్క మహాత్మాగాంధీ ఫోటోలే ముద్రించటం సరికాదన్నారు. ‘‘ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజ్ పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.

ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

Next Story
Share it