Telugu Gateway
Cinema

‘మా’ ప్రెసిడెంట్ నరేష్ ట్వీట్ దుమారం

‘మా’ ప్రెసిడెంట్ నరేష్ ట్వీట్ దుమారం
X

టాలీవుడ్ లో బాలకృష్ణ రేపిన దుమారం కొనసాగుతూనే ఉంది. ‘మా’ను డమ్మీ చేసి కొంత మంది పెద్దలే షో నడిపిస్తున్నారనే విషయమే నిజం అని తేలింది. దీనికి మా అధ్యక్షుడు వి కె నరేష్ చేసిన ట్వీట్ మరింత బలం చేకూరుస్తోంది. బాలకృష్ణను చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశానికి లేదా సీఎం కెసీఆర్ దగ్గర జరిగిన సమావేశానికి పిలవాల్సింది ‘మా’ మాత్రమే అని సీ. కళ్యాణ్ ప్రకటన చేశారు. దీనిపై మా అధ్యక్షుడు నరేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘సీ కళ్యాణ్ ప్రకటన చూసి షాక్ కు గురయ్యా. బాలకృష్ణను సమావేశాలకు పిలవాల్సింది ‘మా’నే అని చెప్పారు. మా అధ్యక్షుడిగా తనకూ లేదా మా ప్రధాన కార్యదర్శికి కూడా ఇలాంటి సమావేశాలు ఉన్నాయనే సమాచారమే ఎవరూ ఇవ్వలేదు.

అలాంటిది తాను ఇతరులను ఎలా పిలవగలను’ అని ట్వీట్ లో ప్రస్తావించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే నరేష్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. కొత్త ట్వీట్ పెట్టారు. సీ. కళ్యాణ్ చేసిన ప్రకటనకు సంబంధించి చేసిన ట్వీట్ ను తొలగించాను. సీ. కళ్యాణ్ పోన్ చేసి తన ఉద్దేశం అదికాదని..సమాచారలోపం వల్ల అలా జరిగిందని తెలిపారు. అదే సమయంలో టాలీవుడ్ లో ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తాము దీని కోసమే పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలు అన్నీ పరిశ్రమలో నెలకొన్న వివాదాలు..విభేదాలను చెప్పకనే చెబుతున్నాయి.

Next Story
Share it