కొత్త కరోనా కేసులన్నీ జీహెచ్ఎంసీలోనే
BY Telugu Gateway3 May 2020 4:01 PM GMT
X
Telugu Gateway3 May 2020 4:01 PM GMT
తెలంగాణలో కొత్తగా వెలుగుచూస్తున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం కీలకంగా మారింది. గత 24 గంటల్లో కొత్తగా 21 కేసులు వెలుగుచూడగా..అందులో 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఒక్క కేసు మాత్రం జగిత్యాలలో నమోదు అయింది. తాజా కేసులతో కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కు పెరిగింది.
ఇందులో 545 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. 508 మందికి మాత్రం చికిత్స అందుతోంది. ఆదివారం నాడు 46 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 29గా నమోదు అయింది. తెలంగాణలో అసలు ఇఫ్పటివరకూ వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో అసలు కరోనా కేసు ఊసే లేదు.
Next Story