ఏపీలో రెండు వేలు దాటిన కరోనా కేసులు
BY Telugu Gateway11 May 2020 1:54 PM IST

X
Telugu Gateway11 May 2020 1:54 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. అందులో ఇప్పటికే 998 మంది డిశ్చార్జి కాగా, 45 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 975 మంది. గత 24 గంటల్లో అనంతపురం లో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5, కృష్ణాలో 3, కర్నూలులో 9, నెల్లూరులో 1, విశాఖపట్నంలో 3 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరులో వచ్చిన తొమ్మిది కేసుల్లో ఎనిమిది కేసులు కోయంబేడు తమిళనాడు నుంచి వచ్చినవి అని హెల్త్ బులెటిన్ లో తెలిపారు. 24 గంటల్లో 7409 శాంపిళ్ళను పరీక్షించగా 38 కేసులువెలుగు చూశాయి.
Next Story