విజయనగరంలోకీ కరోనా..మూడు కేసులు నమోదు
BY Telugu Gateway7 May 2020 1:13 PM IST

X
Telugu Gateway7 May 2020 1:13 PM IST
ఏపీలో ఇఫ్పటి వరకూ అసలు కరోనా లేని జిల్లాగా విజయనగరం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆ జిల్లా కూడా కరోనా జిల్లాల జాబితాలో చేరింది. సర్కారు అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోనే జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదు అయినట్లు స్పష్టం చేశారు. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో కాస్త తగ్గుముఖం పట్టి కొత్తగా 7 కేసులు వచ్చాయి.
కృష్ణాలో కొత్తగా 16 కేసులు నమోదు కాగా, గుంటూరులో 10, నెల్లూరులో 4, విశాఖపట్నంలో 7, అనంతపురంలో 3 కేసులు వచ్చాయి. కొత్తగా వచ్చిన 56 కేసులతో కలుపుకుంటే ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1833కు పెరిగింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1015 ఉంటే..ఇప్పటికే 780 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లోకరోనా కారణంగా ఇద్దరు మరణించారు.
Next Story