ఇద్దరు సీఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని క్రైస్తవ రాజ్యాంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీతో కలసి కలసి పనిచేస్తామని జనసేన అధినేత పవన్ చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ తో తెలుగు రాష్ట్రాల్లో పలు అంశాలపై చర్చించానని తెలిపారు. ఇద్దరు సీఎంలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు సహా... నదీ జలాలపై కూడా పవన్ తో చర్చించినట్లు వెల్లడించారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలసి పనిచేస్తున్నామని పవన్ అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేనతో కలసి పోరాటం చేస్తాము. అయోద్య రామమందిరాన్ని రక్షించుకున్నట్లే తిరుపతిని కాపాడుకుంటాం. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే తిరుమలను కాపాడుకోవటం పెద్ద కష్టంకాదు. ఇతర మతాల ప్రార్థన మందిరాల జోలికి వెళ్ళే దమ్ము జగన్ కు ఉందా? హిందులు గర్జిస్తేకేసీఆర్, జగన్ లు పారిపోతారు. తిరుమలను కాపాడుకోవటానికి జెండాలు పక్కన పెట్టి హిందువులు ముందుకురావాలి. తిరుమల ఆస్తులను కాపాడటానికి మాత్రమే కమిటీలు వేయాలి.. అమ్మటానికి కాదన్నారు.