Telugu Gateway
Andhra Pradesh

బ్రాందీ షాపులు ఓపెన్ చేయమన్నది మోడీనే కదా?

బ్రాందీ షాపులు ఓపెన్ చేయమన్నది మోడీనే కదా?
X

చంద్రబాబు తిడితే ఆయన్నే తిట్టాలి.. కానీ జగన్ పై విషం చిమ్ముతారా?.

మోడీకి ప్రేమ సందేశాలు పంపుతారా?.

చంద్రబాబే డబ్బులిచ్చి లైన్లలో నిలుచోబెట్టారు

ఏపీ మంత్రి పేర్నినాని ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పర్మిషన్ ఇచ్చాకే దేశమంతటా అమ్ముతున్నట్లు ఏపీలోనూ బ్రాందీ షాపులు తీశారని అన్నారు. ఆయన మంగళవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మోడీ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని చంద్రబాబు చెబుతున్నారు. బ్రాందీ షాపులు ఎత్తమని చెప్పింది మోడీనే కదా? దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తీశారు. మోడీని మాట అనటానికి చంద్రబాబుకు భయం. మోడీ బ్రాందీ షాపులకు పర్మిషన్ ఇచ్చారు అని ఒక్క మాట అనరు. ధైర్యం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం, మోడీనే బ్రాందీ షాపులు రిలాక్స్ చేయండి అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బ్రాందీ అమ్మకాలకు నేను మినహాయింపు ఇస్తున్నాను. ఈ కర్ఫూ నుంచి మినహాయిస్తున్నాను ఆదేశాలు జారీ చేశారు మోడీ. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బ్రాందీ అమ్మకాలు నిన్న మొదలుపెడితే చంద్రబాబు దీన్ని కూడా తన క్షుద్ర రాజకీయాలకు వాడుకుంటున్నారు.

చంద్రబాబే నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, మాజీ మంత్రులు, కార్యకర్తలకు డబ్బు లు చేతిలో పెట్టి బ్రాందీ షాపుల దగ్గర లైన్లలో నిలుచోండి. మాస్క లు వేసుకోకుండా మనుషులు ఒకరి మీద ఒకరు పడండి..భౌతిక దూరం పాటించకుండా అని కార్యకర్తలు, సానుభతిపరులను బ్రాందీ షాపుల మీదకు ఎగదోయటం దారుణమైన చర్య. కుటుంబ సభ్యులు అయినా చంద్రబాబుకు చెబుతున్నారో లేదో తెలియదు. లోకేష్ నాయుడు కూడా నాన్నా ఇది తప్పు...బాధ్యతారాహిత్యం ..ఇలా చేయటం కరోనా వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని మందలించకపోవటం బాధ్యతారాహిత్యం. ఐదేళ్ళు యువతకు ఐకాన్ గా చెప్పుకున్న లోకేష్ కనీసం చెప్పకపోవటం కరెక్ట్ కాదు. లోకేష్ అయినా కనీసం ఫోన్లు చేసి మా నాన్న చెప్పినా మీరు చేయవద్దు అని చెప్పకోపోవటం సరికాదు. రాజకీయ పార్టీ ఇంతకన్నా దిగజారటం ఏమి ఉంటుంది?. జగన్ ప్రభుత్వం బ్రాందీ అమ్ముతోంది అని సొంత మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంపై నింద వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంత దిగజారి చేసే పరిస్థితి ఉంది. జగన్ పై విషం చిమ్మటం. మోడీకి ప్రేమ సందేశాలు పంపటం. ఇదే చంద్రబాబు చేస్తున్నది.

ఎన్నికలకు ముందు మోడీ భార్య మీద అవాకులు చెవాకులు పేలటం, బావమరిది. వందిమాగధులు అందరూ మోడీని ఎలా తిట్టారో చూశాం. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో బాధ్యతతో వ్యవహరించాల్సిన చంద్రబాబు..ఇవాళ నిత్యం రాజకీయాలు చేస్తూ..రాజకీయాలే పరమావధిగా ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారు. రాజకీయాలు అంటే ఏహ్యభావం కలిగేలా పనిచేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులను క్షుద్ర కార్యక్రమాలకు వాడుతున్నారు. ఎక్కడ మోడీ జైలులో వేస్తాడో అని కంగారు తో ఆయన్ను ప్రసన్నంగా చేసుకునే పనిలో ఉన్నారు. బ్రాందీ షాప్ లు ఓపెన్ చేసినందుకు తిడితే మోడీని కదా తిట్టాల్సింది. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేశమంతా బ్రాండీ షాపులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు. మోడీకి ప్రేమ బాణాలు, జగన్ ను తిట్టడమా? ’అని పేర్ని నాని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ కేంద్ర అనుమతితోనే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయని..దశల వారీ మద్య నిషేధానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

Next Story
Share it