Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కొత్తగా 50 కేసులు

ఏపీలో కొత్తగా 50 కేసులు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 50 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1980కి పెరిగింది. ఒక్కో జిల్లాలో ఒక్కోసారి కేసులు పెరుగుతూ పోతున్నాయి. తొలుత కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వరస పెట్టి పెరుగుతూ పోయిన కేసులు ఇఫ్పుడు పలు కొత్త జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల కన్పిస్తోంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 5, చిత్తూరులో 16, కర్నూలులో 13, నెల్లూరులో 5, గుంటూరులో 6 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే 925 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1010గా ఉంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య మొత్తం 45 మంది.

Next Story
Share it