Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో తగ్గిన కరోనా కేసులు
X

గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న కరోనా కేసులు ఏపీలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అవటం ఊరట కల్పించే అంశం. అయితే అంతకు ముందు మాదిరిగానే మళ్ళీ పెరుగుతాయా?.లేక ఈ తగ్గుముఖం కొనసాగుతుందా అన్నది వేచిచూడాల్సిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన 25 కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య2230కు చేరింది.

ఇందులో ఇప్పటికే 1433 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 747 ఉన్నాయి. కరోనా కారణంగా నమోదు అయిన మరణాలు 50కు చేరాయి. గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 4, గూంటూరులో 4, కర్నూలులో 3, నెల్లూరులో 1, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 3 కేసులు వచ్చాయి. తాజాగా నమోదు అయిన కొత్త కేసుల్లోనూ కోయంబేడు లింక్ లు ఉన్నాయని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

Next Story
Share it