Telugu Gateway
Telangana

తెలంగాణలో ఒకే రోజు 75 కరోనా కేసులు

తెలంగాణలో ఒకే రోజు 75 కరోనా కేసులు
X

ఒక్క శుక్రవారం నాడే తెలంగాణలో 75 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య ఒకేసారి 229కి చేరింది. అదే సమయంలో శుక్రవారం నాడు మరో 15 మంది కరోపా పేషంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటివరకూ వైద్యం పొంది డిశ్చార్జి అయిన వారి సంఖ్య 32కి పెరిగింది. ఇద్దరు కరోనా బారిన పడి చనిపోయారు. ఇవి రెండూ శుక్రవారం నాడే నమోదు అయ్యాయి. ఇందులో ఒకరు షాద్ నగర్, మరొకరు సికింద్రాబాద్ కు చెందిన వారు అన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11కు పెరిగింది.

మర్కజ్ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారిని, వారితో కలిసిన వారిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్స్ కు తరలించినట్లు వెల్లడించారు. వీరందరికి పరీక్షలు చేయించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారన్నారు. ఆరు ల్యాబ్స్ లో 24 గంటలు మూడు షిప్టుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు నికరంగా 186 మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేసిన బులెటిన్ లో ఈ విషయాలు వెల్లడించారు.

Next Story
Share it